
భువనేశ్వర్, నవంబర్ 23: భారత్ బుధవారం అగ్ని-3 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం జరిగిందని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. క్రమ శిక్షణ వ్యాయామంలో భాగంగా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ దీనిని నిర్వహించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది. అగ్ని శ్రేణిలోని మూడో క్షిపణి 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
852809