
ముంబై: మహారాష్ట్రలోని నాసిక్లో భూకంపం సంభవించింది. గోదావరి జన్మస్థలమైన నాసిక్లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నాసిక్కు పశ్చిమాన 89 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూమికి దిగువన ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక కారణంగా భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంపాలు వస్తాయని పేర్కొంది. భూకంపం వల్ల జరిగిన నష్టంపై సమాచారం అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
మాగ్నిట్యూడ్: 3.6, 23-11-2022న సంభవించింది, 04:04:35 IST, అక్షాంశం: 19.95, రేఖాంశం: 72.94, లోతు: 5 కి.మీ, స్థానం: 89 కి.మీ నాశిక్సీ, మహారాష్ట్ర, భారతదేశం మరింత సమాచారం డౌన్లోడ్ చేసుకోండి భూక్యాంప్ యాప్ https:/ /t.co/4girompMiX@ఇండియా డిపార్ట్మెంట్ @ndmaindia @Dr_Mishra1966 @రవి_మోఇఎస్ pic.twitter.com/NcFCa1jGRk
— జాతీయ భూకంప కేంద్రం (@NCS_Earthquake) నవంబర్ 22, 2022
గతంలో గడ్చిరోరి ప్రాంతంలో భూకంపం వచ్చింది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో స్వల్ప భూకంపం సంభవించింది. ఆగస్ట్ 16న రాత్రి 8:58 గంటల తర్వాత, తక్కువ వ్యవధిలో (9:34 మరియు 9:42), నాసిక్ జిల్లాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంపాలు 3.4, 2.1, 1.9గా నమోదయ్యాయి.
851300