భోపాల్, అక్టోబర్ 29: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దొంగతనం చేశారంటూ వ్యాపారులు ఇద్దరు యువకులను ట్రక్కుకు కట్టేసి రోడ్డుపైకి లాగారు. ఈ దారుణ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇద్దరు యువకులపై పోలీసులు చోరీ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా వీడియో ఆధారాలతో లారీకి కట్టేసి ఈడ్చుకెళ్లిన వారిపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇండోర్లోని చోయిత్రమ్ మార్కెట్లో కూరగాయలు దించే సమయంలో యువకులు ట్రక్కుల నుంచి డబ్బు దొంగిలించడాన్ని తాను చూశానని డ్రైవర్ వ్యాపారికి చెప్పాడు. వ్యాపారులు, కొందరు చుట్టుపక్కలవారు ఇద్దరు యువకుల కాళ్లను గొలుసులతో లారీలకు కట్టేసి మార్కెట్ చుట్టూ ఈడ్చుకెళ్లారు.