బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్య చేశారు. తాను జీవించి ఉన్నంత కాలం బీజేపీతో పొత్తు ఉండదని ఈరోజు (సోమవారం) ప్రకటించారు. ‘నాకు ఊపిరి ఉన్నంత వరకు బీజేపీతో ఉండను.. చావును అంగీకరిస్తాను కానీ.. బీజేపీతో మాత్రం ఉండను’ అని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. తనకు సీఎం కావాలని లేదని..బీజేపీ తనపై ఒత్తిడి చేసిందని అన్నారు. ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో అందరికీ తెలుస్తుందని అన్నారు.
ప్రస్తుత బీజేపీ నాయకత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీల హయాంలో వెనక్కి తిరిగి చూసుకున్నారని నితీశ్ అన్నారు. వాజ్పేయి, అద్వానీలను తాను గౌరవిస్తానని, వారికి ఎప్పుడూ మద్దతిస్తానని సీఎం నితీశ్ అన్నారు.