హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శనిగరం శివారు కమలాపూర్ మందర్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లారీ, కారు ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా మృతులు కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.