కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని చెరువు కట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూటర్ను సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదంలో భర్త జంగిటి భాస్కర్ (48) మృతి చెందగా, భార్య పద్మకు తీవ్ర గాయాలయ్యాయి.
స్కూటర్పై వెళ్తున్న సాయి అనే యువకుడికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కమ్మారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు బీబీపేట మండల కేంద్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.