- ప్రధాని మోదీకి మేడే రాజీవ్సాగర్ బహిరంగ లేఖ
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): దేశంలో దళిత క్రైస్తవులపై బీజేపీ చేస్తున్న దాడిని క్రైస్తవ సంఘాలు ఖండిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత క్రైస్తవులపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల దౌర్జన్యాన్ని అరికట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. దళిత క్రైస్తవుల తరపున టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. నాలుగేండ్ల వ్యవస్థ ద్వారా దళితులకు రాజ్యాంగ హక్కులు దక్కకుండా చేసేందుకు బీజేపీ, సంఘ్ పలివాల్ శక్తులు కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. క్రైస్తవ మతంలో చేరిన దళితులకు ఎస్సీ హోదా కల్పించడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రంగనాథ్ మిశ్రా కమిటీ ఎస్సీ హోదాకు మతానికి సంబంధం లేదని సూచించినా పట్టించుకోలేదని ఆరోపించారు.
835929