యాంకర్ రష్మీ ఎవరో తెలియని వారుండరు. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ అనే టీవీ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ యాంకర్గా మారింది. ఆమె 2007లో “యువ” అనే టీవీ షోలో తన కెరీర్ను ప్రారంభించింది. ఈ అమ్మడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తుంది. రష్మీ ఇటీవలే “బొమ్మా బ్లాక్ బస్టర్” సినిమాలో నటించింది. నందు నటించిన చిత్రానికి సంబంధించిన ఇంటర్వ్యూలలో ఇద్దరూ పాల్గొన్నారు. అందులో భాగంగానే రష్మీ, సుదీర్ తమ రిలేషన్ షిప్ గురించి మాట్లాడుకున్నారు.
అయితే జబర్ధస్త్ తర్వాత రష్మీ, సుధీర్ ల కెమిస్ట్రీ చూసిన వారెవరైనా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకోవచ్చు. అయితే తమ రిలేషన్ షిప్ పై రష్మీ మరోసారి స్పందించింది.
“నా గురించి అందరికి చెబుతూ ఉంటే అది నా జీవితం కాదు. అందరికి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అది నా వ్యక్తిగతం. మా సంబంధం ఏదైనా కావచ్చు. అందరికీ చెప్పలేను. కొన్ని విషయాలు నా దగ్గర ఉంచుకుంటాను. నేను భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు.. ఏం జరిగినా అందరికీ తెలిసే ఉంటుంది.. స్క్రీన్పై మనం కనిపించే తీరు ఎలా ఉంటుందో.. మన ప్రయాణం పదేళ్లు.. ఇలా చేశామని అనుకోలేదు. మా కెమిస్ట్రీ అందరినీ మ్యాజిక్ లాగా ఆకర్షించింది” అని రష్మీ అన్నారు.