ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని నేటి (శనివారం) నుంచి అధికారులు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటల తర్వాత స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి లేదు. చలికాలం కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ తెలిపింది.
బద్రీనాథ్ ఆలయం శీతాకాలంలో నాలుగు నెలలకు పైగా మంచుతో కప్పబడి ఉంటుంది. భక్తులను అనుమతించరు. మేలో ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం కమిటీ తెలిపింది.
The post బద్రీనాథ్ ఆలయాన్ని నేటి నుంచి మూసివేయనున్నారు appeared first on T News Telugu.