హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం రాత్రి వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.38 గంటలకు చంద్రగహనం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో స్వామివారికి ఉదయం పూజలు నిర్వహించారు. ఆలయ ద్వారాలను మూసివేశారు.
అలాగే పూజల అనంతరం అనుబంధ ఆలయాల ద్వారాలను కూడా మూసివేస్తారు. గ్రహణం అనంతరం సాయంత్రం 6.18 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరిచి పుణ్యహవచనం, సప్రోక్షణ, నివేదన సమర్పించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారికి మహా పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
830386