మహారాష్ట్రలోని పూణెలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గంగాధం ప్రాంతంలోని గోదాములో ఈ ప్రమాదం జరిగింది.

పూణె: మహారాష్ట్రలోని పూణె నగరంలో అగ్నిప్రమాదం జరిగింది. గంగాధం ప్రాంతంలోని గోదాములో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొగలు వ్యాపించాయి. గోదాం సిబ్బంది అందించిన సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
#చూడండి | పూణెలోని గంగాధమ్ ప్రాంతంలోని ఒక గోదాములో మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. pic.twitter.com/0x8yZdNMQN
— ఆర్నీ (@ANI) జూన్ 18, 2023

