కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో ఉందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ కుట్రను, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న భావనతోనే మేడిగడ్డ వెళ్తున్నాం. తెలంగాణను ఎండబెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తోంది. అవినీతి జరిగిందని పదేపదే మాట్లాడుతున్నారు. జరిగిన ప్రతి పనిలోనూ అవినీతి అని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలుజేయాలని చూస్తున్నారు. అతి పెద్ద అవినీతి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా చెబుతారు? ఆయన విచారణ అధికారా? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అంటున్నారు..సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్థూపం లేకుండా చేస్తారా? మంత్రులు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు, వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం.ఎన్డీ ఎస్ఏ పేరు మీద నీళ్ళు వదిలి మేడిగడ్డ కొట్టుకుపోవాలని, ఎల్లంపల్లిని ఎండపెట్టాలని చూస్తున్నారు. నీళ్ళు ఇవ్వాలని మేము అంటున్నాం, సముద్రంలోకి మీరు వృధాగా వదులుతున్నారు… ఎవరికి సెన్స్ లేదు? మేడిగడ్డ కూలిపోయేలా చేసే కుట్రకు ప్రభుత్వం మాట్లాడుతోంది.కాంగ్రెస్ అభివృద్ధి యాత్రలు చేయాలి కానీ..మాకు పోటీ యాత్రలు కాదు. రైతులను ఆదుకోవాలని కోరుతుంటే అధికారంలో ఉండి పోటీ యాత్రలు చేస్తే ఎలా? దీంతో కాంగ్రెస్ నేతల డొల్లతనం అర్థం అవుతోందన్నారు.
పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం విదేశీ స్కాలర్ షిప్ లు ఉపకారవేతనాలు ఇచ్చారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులు ఇవ్వడం లేదు. వెంటనే విదేశీ ఉపకారవేతనాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ కేవలం 1.5 శాతం ఎక్కువ ఓట్లతో అధికారంలోకి వచ్చిందని..అధికార మదంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్. కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని చూపే ప్రయత్నం.. కుట్ర తగదన్నారు. ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు.
ఇది కూడా చదవండి: అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు నిధులు విడుదలచేయండి
The post అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ రాష్ట్రాన్ని అధోగతి పాలుజేస్తోంది appeared first on tnewstelugu.com.
