అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు శరవేగంగా సాగుతోంది. అక్కడ చిక్కుకున్న వారిని ఆపరేషన్ కావేరీ ద్వారా స్వదేశానికి రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత వైమానిక దళం, నేవీ మరియు ఇతర సైనిక విమానాలు దశలవారీగా భారతీయులను స్వదేశానికి పంపుతున్నాయి.

న్యూఢిల్లీ: అంతర్యుద్ధంతో సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు శరవేగంగా సాగుతోంది. అక్కడ చిక్కుకున్న వారిని ఆపరేషన్ కావేరీ ద్వారా స్వదేశానికి రప్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత వైమానిక దళం, నేవీ మరియు ఇతర సైనిక విమానాలు దశలవారీగా భారతీయులను స్వదేశానికి పంపుతున్నాయి. ఆ క్రమంలో జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 360 మంది భారతీయులతో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ విమానం బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఏం జరుగుతుందోనని భయపడిన బాధితులంతా క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు.
కాగా, సూడాన్లో చిక్కుకున్న వారిలో ఇప్పటివరకు 534 మంది భారత్కు తిరిగి వచ్చారు. ఇప్పటికీ అక్కడున్న వారిని ఒప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సుడాన్లోని 256 మంది భారతీయులు భారత వైమానిక దళానికి చెందిన రెండు C-130J సైనిక రవాణా విమానాలలో పోర్ట్ సుడాన్ నుండి జెడ్డాకు వెళ్లారు. దీనికి ముందు, 278 మందిని భారత నౌకాదళ నౌకల్లో యుద్ధభూమి నుండి సురక్షితంగా తరలించారు.

సూడాన్ నియంత్రణ కోసం ఆ దేశ సైన్యం, పారామిలటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (ఆర్ఎస్ఎఫ్)కి మధ్య గత కొద్ది రోజులుగా తీవ్ర ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సాయుధ బలగాల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. కాగా, సూడాన్లో మూడు వేల మందికి పైగా భారతీయులను గుర్తించారు.
భారతదేశం తనను తాను తిరిగి స్వాగతించింది. #ఆపరేషన్ కావేరి మొదటి విమానం న్యూఢిల్లీకి చేరుకుంది, 360 మంది భారతీయ పౌరులు వారి స్వదేశానికి తిరిగి వచ్చారు. pic.twitter.com/v9pBLmBQ8X
డా. ఎస్. జైశంకర్ (@DrSJaishankar) ఏప్రిల్ 26, 2023
