
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ చౌరస్తాలో ఇంధన ట్యాంకర్ బోల్తా పడింది. హైదరాబాద్-విజయవాడ రహదారిపై ట్యాంకర్ బోల్తా పడడంతో వాహనం కిలోమీటర్ల మేర నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్కు ట్యాంకర్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అవుతుందన్న భయంతో స్థానికులు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న ట్యాంకర్ లారీని తొలగించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
