ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ ఆరు సార్లు సమన్లు జారీ చేసింది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ఇప్పటివరకు విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు.అయితే, ఈడీ అధికారులు అరెస్ట్ కు సన్నాహాలు చేస్తున్నారన్న నేపథ్యంలో… కేజ్రీవాల్ ఇవాళ(శనివారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ కోర్టు విచారణకు హాజరయ్యారు. నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోసం కేజ్రీవాల్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర బడ్జెట్, విశ్వాస తీర్మానం కారణంగా ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకాలేకపోయానని వివరణ ఇచ్చారు. మార్చి 16న జరిగే విచారణకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని తెలిపారు.
అరెస్ట్ వార్తల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో నిన్న విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ సభలో బలపరీక్ష నిర్వహించారు. ఈ విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్ నెగ్గారు.
ఇది కూడా చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్14
