కవిత అరెస్టుపై బీఎస్పీ పార్టీ స్పందించింది. కేంద్రంలోని మోదీ సర్కార్ ఈడీని అడ్డంపెట్టుకుని కవితను అరెస్టు చేయడం ఓ బూటకం అంటూ మండిపడింది. దీనిని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపింది. కేసీఆర్ తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోదీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెరతీశాడంటూ ఆరోపించింది. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికమని బీఎస్పీ పార్టీ తెలిపింది. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు అని పేర్కొంది.
ఇలాంటి అక్రమ అరెస్ట్ లతో అదిరేది బెదిరేది లేదుని హెచ్చరించింది బీఎస్పీ పార్టీ. బెదిరితే తెలంగాణ వచ్చేదా కాదని గుర్తు చేసింది. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమేనని ఆరోపించింది.ఈడీ తో బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి తగిన బుద్ధి చెప్పబోతున్నారంటూ బీఎస్పీ అన్నది.
దేశంలో మోడి పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందని ఫైర్ అయ్యింది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…?అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీని తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ పార్టీ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు సూచించింది.
బిఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది.
కేసీఆర్ గారు…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 15, 2024
ఇది కూడా చదవండి: కవిత అరెస్టుపై..సుప్రీంకు ఈడీ సమాధానం చెప్పాలి:కేటీఆర్
