ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదని ఆయన తెలిపారు.
సమగ్ర శిశు ఉద్యోగులకు వేతనాలు, మధ్యాహ్న భోజన కార్మికుల వంట ఛార్జీలు, కోడిగుడ్డు బిల్లులు పెండింగ్లో ఉండటంపై హరీశ్రావు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించారు. ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుంచి వేతనాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంట ఛార్జీలు, కోడిగుడ్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి
