బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రూ. 100 కోట్లు ఖర్చు పెట్టిందని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. ఇవాళ(సోమవారం) తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.రూ. 100 కోట్లతో తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ సభ అజెండా ఏందంటే.. కేవలం కేసీఆర్ను తిట్టడమే. రాహుల్, రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ను తిట్టారు. కేసీఆర్ అంటేనే రాహుల్, రేవంత్ భయపడుతున్నారు. ఇక రాహుల్ గాంధీ మళ్లీ రాసిచ్చిన స్క్రిప్టునే చదివారు. వరంగల్ డిక్లరేషన్లో ప్రకటించిన రూ. 500 బోనస్, రైతుకు రూ. 15 వేల ఆర్థికసాయం వంటి హామీలను అమలు చేయలేదు. ఇప్పుడేమో తుక్కుగూడ వచ్చి కేసీఆర్ ఫోన్ ట్యాపిగ్ ఆరోపణ చేశారు రాహుల్. రైతు ఆత్మహత్యలు, ఎండిన పంటల అంశాన్ని, రైతుల డిమాండ్లను పక్కదారి పట్టించేందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని మన్నె క్రిశాంక్ తెలిపారు.
ఓట్ల కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ను వెబ్సిరీస్గా నడిపిస్తోంది. మోడీనేమో ఈడీ పేరుతో హింసిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాలపై బురదజల్లి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 లక్షల కన్వర్జేషన్స్ ట్యాపింగ్ చేశారని, దీని కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరి వాటిపై నిస్పక్షపాతంగా విచారణ చేయాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు.
సోనియా యూపీఏ చైర్పర్సన్గా, రాహుల్ ఎంపీగా ఉన్నప్పుడు, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఫోన్ ట్యాపింగ్పై ఒక స్టేట్మెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అవసరమని మన్మోహనే చెప్పారు. మరి మన్మోహన్ను బద్నాం చేశారా..? మరి మేం మాట్లాడితే రేవంత్ రెడ్డి తమపై కేసులు పెట్టిస్తున్నారు. మరి రాహుల్ గాంధీకి అప్పుడు సోయి లేదా..? అప్పుడు ఎంపీగా ఉన్నారు కదా..? మరి ఇవాళ మన్మోహన్ మీద ఎందుకు విచారణ చేయలేదు. టెలింకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఫోన్ ట్యాపింగ్ విషయాలను బయటపెట్టలేమని ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. ఫోన్లు ట్యాపింగ్ జరిగాయా..? లేదా..? అన్నది ట్రాయ్ని అడగండి. మరి ఈ కేసులో ట్రాయ్, టెలికాం ప్రొవైడర్లను ఎందుకు పెట్టలేదు. ఎందుకంటే కొందరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానం వస్తుంది. ఏది నిజమో తెలియడం లేదన్నారు మన్నె క్రిశాంక్.
ఇది కూడా చదవండి: పొద్దుతిరుగుడు పంట కొనుగోలుపై సీఎం రేవంత్ కు హరీశ్ రావు లేఖ