కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి.
- 13 దుకాణాల నిర్వహణకు వేలం పాటలు గతేడాదితో పోలిస్తే 1.14 కోట్లు పెరుగుదల
మల్యాల, జనవరి 29 : కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు దుకాణం నిర్వహణకు కరీంనగర్లోని దేవాదాయ ధర్మాధాయశాఖ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు.
మొత్తంగా ఆలయానికి 3,88,41,221 ఆదాయం సమకూరిందని, ఇది ప్రస్తుత ఏడాది ధరలతో పోలిస్తే 1,14,70,950 అధికంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామీ, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాసశర్మ, సునీల్, సెక్షన్ ఇన్చార్జి ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు.
ఏయే దుకాణాలకు ఎంతంటే..
- కొబ్బరికాయల విక్రయానికి 1.37 కోట్లు
- కిరాణం నిర్వహణకు 11 లక్షలు
- పుట్నాలు, ప్యాలాల విక్రయాలకు 24.75 లక్షలు
- పూలు, పండ్ల విక్రయాలకు 34.50 లక్షలు
- గాజులు, ప్లాస్టిక్ ఆట వస్తువుల విక్రయాలకు 27.75 లక్షలు
- భక్తుల పాదరక్షలు భద్రపరిచేందుకు 9 లక్షలు
- వంట చెరుకు విక్రయానికి 64 వేలు
- హోటల్ నిర్వహణకు 14.50 లక్షలు
- కొబ్బరి ముక్కలు సేకరణకు 80.20 లక్షలు
- కూల్డ్రింక్స్, ఐస్క్రీం విక్రయాలకు 10.25 లక్షలు
- ఫొటోస్టూడియో నిర్వహణకు 14,16,166
- లాకర్ రూం నిర్వహణకు 12.40 లక్షలు
- సులభ్ కాంప్లెక్స్ నిర్వహణకు 12,25,555
