చేవెళ్ల : విద్యార్థులు క్రీడలు, చదువుల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు వస్తుందని చేవెళ్ల ఎంపీపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్రెడ్డి వైద్య కళాశాల నూతన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తాయని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సూచించారు. పోటీల్లో గెలుపొందడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
తెలంగాణలో క్రీడలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాలను నిర్మిస్తుందన్నారు. సమాజంలో వైద్యం, విద్యకు మంచి గుర్తింపు ఉందన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు.
కార్యక్రమంలో మెడిసిన్ ఫ్యాకల్టీ జనరల్ సంతోష్రెడ్డి, మెడిసిన్ అధ్యక్షురాలు డాక్టర్ జోయారాణి, ఉపాధ్యక్షుడు రాజేశ్వరరావు, చేవెళ్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి, డిప్యూటీ ఎంపీపీ కర్నె శివప్రసాద్ పాల్గొన్నారు.
క్రీడలు, చదువుల్లో రాణిస్తే సమాజంలో గుర్తింపు వస్తుంది This post appeared first on T News Telugu.
