హైదరాబాద్లో మరోసారి గంజాయి పట్టుబడింది. గచ్చిబౌలిలోని ఏపీహెచ్బీ కాలనీలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన గంజాయిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. గంజాయి అమ్ముతున్న యువకుడిని అరెస్టు చేశారు. అతని నుంచి 250 గ్రాముల మత్తుమందు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి అమ్మకానికి సిద్ధం చేశాడని చెప్పారు. నిందితుడిని బసవ రాజప్ప ప్రమోద్గా గుర్తించారు. గంజాయిని దూల్పేట నుంచి సేకరించాడని, దానిని చిన్న ప్యాకెట్లుగా చేసి కూలీలకు అమ్ముతున్నాడని చెప్పారు.
మరో ఘటనలో గచ్చిబౌలిలోని ఓయో లాడ్జ్లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ముగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజరాజేశ్వర కాలనీలో ఉన్న సిల్వర్ కీ ఓయో లాడ్జ్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో దాడిచేశారు. పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.52 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు బస్వరాజ్ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. చేవెళ్ల లో ఇవాళ మొదటి బహిరంగసభ