పదవులు అనుభవించి, అవకాశాలు పొంది పార్టీ మారుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్. కాంగ్రెస్,తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారన్నారు. ఇవాళ(శనివారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఎర్రోళ్ల శ్రీనివాస్…రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారు. కేసీఆర్ ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది?. కడియం కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారు. రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారు. ఇన్నేళ్ల మీ అనుభవాన్ని మీ రాజకీయ స్వార్థం కోసం వాడుకున్నారు. మేము త్యాగాలు చేశాము.. మీరు భోగాలు అనుభవించారు. ఊసరవెల్లి, పాము కంటే ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎఉస్ అన్నీ అనుభవించి ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లోకి పోతున్నారా?.మా పార్టీ నుంచి వచ్చిన పదవులకు రాజీనామా చేసి వెళ్ళాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దర్శకత్వంలో కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎర్రోళ్ల శ్రీనివాస్. బీఆర్ఎస్ మీకు తీర్థయాత్ర లాగా కనిపిస్తుందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఉన్న చెడ్డీ గ్యాంగ్ ల తరహాలో పార్టీలు మారే నేతలు కనిపిస్తున్నారన్నారు.వయసు పెరిగిన ప్రతి వారు మేధావి అనుకుంటే సరిపోదు. మీరు అంతా స్వార్థపరులు అని అన్నారు. కడియం లాంటి వారి వల్ల జాతికి ఎలాంటి లాభం లేదన్న మందకృష్ణ వ్యాఖ్యలు నిజమన్నారు. ఇలాంటి వ్యక్తులను రాళ్లతో కొట్టినా పాపం లేదన్నారు. పార్టీలు మారే వారి విషయంలో ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. పదవులకు రాజీనామా చేయకపోతే ఇండ్ల ముందు సావు డప్పులు ఉంటాయి, ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. చెప్పిన మాటలను సీఎం అమలు చేయాలి… లేదంటే ప్రజలు చేస్తారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. మా లాంటి వాళ్ళం నష్ట పోయాం.. మీరు నష్టపోవద్దని చెప్పారు శ్రీనివాస్.
తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కేశవరావుకు బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది?. బిడ్డల రాజకీయ జీవితం కోసం ఇద్దరు నేతలు బుడ్డెర ఖాన్ లలా మారారు. ఇటువంటి వ్యతిరేక శక్తులు, ద్రోహులు ఎక్కడ పోటీ చేసినా ఉద్యమకారులు, నేతలు, కార్యకర్తలు ఓడించాలన్నారు. కేసీఆర్ అవకాశం ఇస్తే వరంగల్ లోక్ సభ స్థానానికి పోటీ చేస్తానని తెలిపారు ఎర్రోళ్ల శ్రీనివాస్.
ఇది కూడా చదవండి: అన్నదాతకు అండగా కొప్పుల ఈశ్వర్ 36 గంటల రైతు భరోసా దీక్ష
The post చెడ్డీ గ్యాంగ్ ల తరహాలో కన్పిస్తున్నారు పార్టీలు మారే నేతలు appeared first on tnewstelugu.com.