
తిరుమల: తిరుమలలో భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 72,176 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 25,549 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
822507
