తెలంగాణలో బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెదక్ కలెక్టర్గా రాహుల్ రాజ్, ఆదిలాబాద్ కలెక్టర్గా రాజర్షి షా, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీశ్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా బీహెచ్ సహదేవ్రావు, హైదరాబాద్ అదనపు కలెక్టర్గా హేమంత కేశవ పాటిల్ నియామకం అయ్యారు. దీనికి సంబందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారు
