బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్త్రుతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11గంటలకు అచ్చంపేట నియోజకవర్గంలోని డీకే ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 2గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు ప్రమోషన్..స్టీఫెర్ రవీంద్రకు ?
The post నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేటీఆర్ పర్యటన.! appeared first on tnewstelugu.com.
