దేశ అత్యున్నత పౌర పురస్కారంభారతరత్న ప్రదానోత్సవం ఇవాళ( శనివారం) నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపదీ ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
పలు రంగాల్లో దేశానికి సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు ఈ ఏడాది మూడు విడతల్లో ‘భారతరత్న’ ప్రకటించింది ప్రభుత్వం. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు.
ఇందులో నలుగురికి మరణానంతరం ఈ అవార్డు లభించగా.. ఇవాళ వారి కుటుంబసభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరీ ఠాకుర్ తరఫున ఆయన కుమారుడు రామ్నాథ్, చౌదరీ చరణ్ సింగ్ తరఫున ఆయన మనవుడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరఫున అవార్డును కుమార్తె నిత్యా రావు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి ‘భారతరత్న’ ప్రదానం చేయనున్నారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత