అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఇండియన్ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు దక్కింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఇటీవల బెర్లిన్ 74వ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు జర్మనీకి చేరుకున్నాడు.
ప్రస్తుతం ఐకాన్స్టార్ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వున్నాడు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’ సంచలన విజయం సాధించింది. 2021 బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పుష్ప. అల్లు అర్జున్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు, జాతీయస్థాయి అవార్డు తెచ్చిన చిత్రం’పుష్ప’.
దీంతో దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ‘పుష్ప-2 ద రూల్’ చిత్రం పై భారీ అంచనాలు పెరిగాయి. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్గా పుష్ప ది రైజ్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేశారు నిర్వాహకులు.
ఇది కూడా చదవండి:ఈడీ కోర్టు విచారణకు హాజరైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
