పాకిస్తాన్ లో ఓ గ్యాంగ్స్టర్ హత్యకు గురయ్యాడు. పెళ్లి వేడుకకు వెళ్లిన అతడిపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడికక్కడే అతడు చనిపోయాడు. ఇవాళ(సోమవారం) లాహోర్లో ఈ ఘటన జరిగింది.
గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ నెట్వర్క్ యజమాని అయిన అమీర్ బాలాజ్ టిప్పు అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్. లాహోర్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మ్యారేజ్ జరుగుతుండగా అమీర్పై కొందరు వ్యక్తులు కాల్పులకు జరిపారు. ఈ ఘటనలో అతడితో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన అమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా.. ఆ కాల్పుల్లో ఒక షూటర్ అక్కడికక్కడే చనిపోయాడు.
కాల్పుల్లో గాయపడిన వారిని స్థానికులు జిన్నా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అమీర్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి:హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అగ్ని ప్రమాదం
The post పెళ్లి వేడుకలో కాల్పలు.. గ్యాంగ్స్టర్ హత్య appeared first on tnewstelugu.com.
