కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి కోరుకుంటారు. కొందరేమో రిస్క్ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం ఆశిస్తారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS) మంచి ఎంపిక. పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకునే వారి కోసం ఈ స్కీమ్. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకొంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది.
పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన సొమ్ముకు మార్కెట్తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్ సేఫ్ అన్నమాట.
ఈ పథకంలో డిపాజిట్ చేయాలనుకునే వారు.. పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎవరైనా సరే వ్యక్తిగతంగా, జాయింటుగా ఖాతాను తెరవొచ్చు. 10 ఏళ్లు నిండిన పిల్లల పేరుపై గార్డియన్ (మైనర్ ఖాతా) ఖాతా తెరవొచ్చు. ఈ పథకంలో కనీసం రూ.1,000 పెట్టుబడిగా పెట్టొచ్చు. సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో అయితే గరిష్టంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.
ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ ఇస్తున్నారు. మెచ్యూరిటీ పూర్తయ్యేవరకు ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. ఎంఐఎస్ ఖాతా తెరిచిన తర్వాత ఐదేళ్లకు మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు విత్ డ్రా చేస్తే చేస్తే నిబంధనల ప్రకారం వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇస్తారు. మీకు నెలవారీ రూ.5,550 ఆదాయం రావాలనుకుంటే రూ.9 లక్షలు ఎంఐఎస్ స్కీమ్లో డిపాజిట్ చేయాలి. ఇక జాయింట్ ఖాతా తెరిచి రూ.15 లక్షలు డిపాజిట్ చేసిన వారికి రూ.9,250 నెలవారీ డబ్బు వస్తుంది. మీ నెలవారీ ఖర్చు, కావాలనుకొనే ఆదాయం ఆధారంగా మదుపు చేయొచ్చు.
ఇది కూడా చదవండి: మళ్లీ పోటీ చేయను..ఇవే చివరి ఎన్నికలు
