ప్రేమ..ప్రేమించే వ్యక్తి ముందు ఏదీ ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎంతటి త్యాగం అయినా చిన్నగానే అనిపిస్తుంది. అందరూ ప్రేమించామని మాటలు చెప్పేవాళ్లే..నిజంగా ప్రేమించే వాళ్లను మనం ఎక్కడో అరుదుగా చూస్తుంటాం.. ప్రేమించిన వ్యక్తి కోసం.. కుటుంబాన్ని వదులుకోవడానికి చాలా మంది మహిళలు ధైర్యం చేయరు.. వారిని ఆ బంధం కట్టిపడేస్తుంది. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబంతో పాటు 2500 కోట్ల ఆస్తిని వదిలేసుకుని వచ్చింది ఓ ప్రేమికురాలు.
మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ప్రేమకు కుటుంబం అంగీకరించకపోవడంతో కుటుంబ ఆస్తులను వదిలేసి వచ్చింది. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ మలేషియా వ్యాపారవేత్త కూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. చాలా ధనిక కుటుంబానికి చెందిన ఆమె అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, ఏంజెలిన్ తన క్లాస్మేట్ అయిన జెడిడియాతో ప్రేమలో పడింది. ఏంజెలిన్ తన ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పగా, వారు అంగీకరించలేదు.
ఏంజెల్ తండ్రి డబ్బు, ఆస్తి, హోదా వంటి కారణాలతో ఏంజెల్ ప్రేమను అంగీకరించలేదు. ఫలితంగా, ఆమె తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడం ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఆమె తన ప్రేమికుడు జెడిడియా ఫ్రాన్సిస్ను వివాహం చేసుకోవడానికి వారసత్వంగా వచ్చిన $300 మిలియన్లను (దాదాపు రూ. 2,484 కోట్లు) వద్దనుకుంది. ఏంజెలిన్, జెడిడియా 2008లో వివాహం చేసుకున్నారు. వారి కుటుంబాలకు దూరంగా నివసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆగకుండా తుమ్ములు వస్తున్నాయా…అయితే డేంజర్..