కేసీఆర్ ప్రభుత్వం రాగానే వీర్ణపల్లి మండలంగా మర్చామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను లెక్కబెడితే 420 వచ్చాయన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల బీ.ఆర్.ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన కేటీఆర్ ఆ తర్వాత మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ఇప్పుడే సీఎం కుర్చీలో కూర్చున్న అప్పుడే ఆ చెంప.. ఈ చెంప వాయిస్తున్నారు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను భారీ మెజార్టీ తో గెలిపించుకుంటాం. పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. ఇప్పుడు కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు లెక్కలతో చెపుతున్న. ఒక టీఎంసీ వాటర్ అంటే హైదరాబాద్ లో ఉన్న హుస్సేన్ సాగర్ ఉన్న నీళ్ళతో సమానం. కేసీఆర్ ఉంటే ఏదో రకంగా నీళ్లు తెస్తుండే అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ ఉంటే కాళేశ్వరం వీలైనంత తొందరగా రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇస్తుండే. రాజకీయాలు పక్కన పెట్టి రైతులు చనిపొకముందే .. దమ్ముంటే నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు.
కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని రైతు బంధు పడుతుండే. మోసపోతే గోస పాడుతారు అని కేసీఆర్ ముందే చెప్పిండు. బండి సంజయ్ కి బుద్ధి చెప్పాలంటే నాకంటే వినోద్ కుమార్ కు ఎక్కువ మెజార్టీ ఇవ్వాలి. నామీద కోపం కొద్ది మెజార్టీ తగ్గించారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఇవ్వాలి. బండి సంజయ్ వీర్ణపల్లికి ఒక్క రూపాయి అన్న తెచ్చిండా.. గంత మాత్రానికి మనం బీజేపీకి ఓటు వేద్దామా అని ప్రశ్నించారు కేటీఆర్. పార్లమెంట్ లో మాట్లాడాలంటే బండి సంజయ్ కి హిందీ, ఇంగ్లీష్ రాదు ఎలా మాట్లాడుతారు. పార్లమెంట్ లో బండి సంజయ్ హాజరు 5% శాతం మాత్రమే. బీజేపీ హిందూ దేవుళ్ళ పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారు. గతంలో వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నపుడు వీర్ణపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేశారు. మళ్ళీ కరువు ముంచుకొస్తుంది. కేసీఆర్ కు ఎందుకు ఓటు వేయాలి. గతాన్ని గుర్తు చేసుకుని వినోద్ కుమార్ కు ఓట్లు వేసుకొని గెలిపించుకోవాలని సూచించారు కేటీఆర్. రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు ఖచ్చితంగా అడగాలి. ఎలక్షన్ కోడ్ రాకముందే రైతులకు ఇచ్చే బోనస్ పై జీవో తీసి రైతులను ఆదుకోవాలి. 12 తేదీన కరీంనగర్ లో కథన భేరికి భారీగా హాజరై విజయవంతం చేయాలనా పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా..!
