
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ క్షమాపణలు చెప్పింది. ఊహించని తప్పిదానికి క్షమాపణలు చెబుతున్నామని, ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది.
న్యూ ఇయర్ సందర్భంగా, Meta’s WhatsApp తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో చూపబడిన భూగోళంలో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మరియు కొన్ని భారత భూభాగాలు ఇతర దేశాలలో భాగంగా చూపబడ్డాయి.

ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు వాట్సాప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. వాట్సాప్ లోపాన్ని వెంటనే సరిదిద్దాలని సూచించారు.
దీనిపై వాట్సాప్ స్పందిస్తూ.. ‘అనుకోని లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేస్తూ వీడియోను తొలగించినట్లు ఆమె తెలిపారు.
