
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మళ్లీ భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించింది. మణిపూర్లోని తాబూర్లో రాత్రి 11:43 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించింది. భూమి లోపల 40 కిలోమీటర్ల లోతులో కదలిక జరుగుతుందని చెప్పారు. అర్ధరాత్రి భూకంపం రావడంతో ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. భూకంపం కారణంగా సంభవించిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
మాగ్నిట్యూడ్: 3.3, 23-10-2022న సంభవించింది, 23:41:34 IST, అక్షాంశం: 24.66 & రేఖాంశం: 93.97, లోతు: 40 కి.మీ, స్థానం: తౌబల్, మణిపూర్, భారతదేశం భూకంప్ యాప్ని మరింత డౌన్లోడ్ చేసుకోండి https: / /t. సహ/ly1Uzc8jUB pic.twitter.com/50GKzjE47N
— నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (@NCS_Earthquake) అక్టోబర్ 23, 2022
అత్యంత ప్రమాదకర జోన్లో ఉన్న మణిపూర్లో శుక్రవారం కూడా భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.4గా నమోదైందని ఎన్సీఎస్ వెల్లడించింది. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
811888