మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు లెక్కింపు ఆదాయం రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు ఇవాళ(గురువారం) హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు. లెక్కింపు కోసం సీసీ కెమెరాలతో పాటు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచి శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
