తెలంగాణలో భానుడి ప్రతాపం మొదలయింది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అవసరం ఉన్నా బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
వేసవి ప్రారంభంలోనే సాధారణం కన్నా 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతోందని తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రెండు నెలలు ఎండలు మండిపోవడం ఖాయమంటోంది. అంతే కాదు రేపటి(ఆదివారం) నుంచి తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, భద్రాద్రి, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ తెలిపింది. బయటకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు.కూల్ డ్రింక్స్ కాకుండా పండ్ల రసాలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి:దానం నాగేందర్ ను వెంటనే అనర్హుడిగా ప్రకటించాలి
The post రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ appeared first on tnewstelugu.com.