రేపటి( బుధవారం) నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సబ్సిడి బస్ పాస్, హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించొచ్చని సూచించారు.
సబ్సిడి బస్ పాస్ లేని విద్యార్థులకు నామమాత్రపు ధరతో టికెట్ జారీ చేస్తారని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నీ రూట్లలో బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఎక్కడైన బస్సుల రాకపోకల్లో ఆలస్యమైతే కోఠి-9959226160, రేతిఫైల్-9959226154 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ నెంబర్లను సంప్రదిస్తే బస్సుల సమాచారం కూడా తెలియజేస్తారని తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్.. ఆ టిక్కెట్లు పాత రేటుకే!
The post రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు appeared first on tnewstelugu.com.
