డిసెంబర్ 9న అన్ని హామీలు నేరవెస్తా అని మాట ఇచ్చిన రేవంత్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, చేనేతలను ఆదుకున్నామని అన్నారు. ఇవాళ(మంగళవారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన.. బతుకమ్మ చీరలు నేసే పనిని చేనేతలకు ఇచ్చి పని కల్పించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని పనులను క్యాన్సిల్ చేస్తోందని ఆరోపించారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డున పడ్డారని తెలిపారు. చేనేతలకు పని కల్పించాలని తాను మంత్రి తుమ్మలను కలిసి రిక్వెస్ట్ చేస్తే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మహేందర్ రెడ్డి వరకూ పనులు చేయకుండా పబ్బం గడిపేస్తున్నారంటూ ఆరోపించారు.. రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేసీఆర్ పై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుపెడితే సిరిసిల్లలో ఉన్న మహేందర్ రెడ్డి వరకు అందరూ దగుల్బాజీలు, సన్నాసులు, చేతకాని వెధవలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
నియోజకవర్గంలో మంజూరైన రూ. 14 కోట్ల రోడ్డు రద్దు చేయడం కాదు.. నీకు దమ్ముంటే, చేతనైతే ప్రజల మనసు గెలుచుకోవాలి. దుబ్బాక నుంచి ముస్తాబాద్ వరకు తాను రెండు లేన్ల రోడ్డు మంజూరు చేశాను. నీకు చేతనైతే ఆ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చి ప్రజల మనసును గెలుచుకోవాలి. కేసీఆర్ మీద కోపంతో చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం వేస్ట్ అంటున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వొద్దు.. కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతో దివాళా, దగుల్బాజీ రాజకీయం చేస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కేసులకు, జైళ్లకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పనులను రద్దు చేస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు, నేతన్నలను ఆదుకున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు వేయలేదు. ఎల్ఆర్ఎస్పై రేపు(బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. బీఆర్ఎస్ కేవలం 4 లక్షల ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదు. మతం పేరుతో ఓట్లు అడగడం తప్ప సంజయ్ చేసిందేమీ లేదు. అయోధ్య పేరు మీద ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో కదన భేరి బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు కేటీఆర్.
ఇది కూడా చదవండి: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెప్పాలి
The post రేవంత్ నుంచి మహేందర్ రెడ్డి వరకు అందరూ సన్నాసులే appeared first on tnewstelugu.com.
