రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఎన్ కౌంటర్లు, కూల్చివేతలన్నారు. రాష్ట్రం లో నిజంగానే ఇందిరమ్మ రాజ్యం నిజంగా నడుస్తోందన్నారు. ఇవాళ(శనివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ,క్రాంతి కిరణ్ ,కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఆంజనేయ గౌడ్ ,పల్లె రవికుమార్.
ప్రశ్నించే గొంతుకల పై ప్రజాపాలన అని చెప్పుకుంటూ దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీనియర్ జర్నలిస్టు శంకర్ పై కాంగ్రెస్ గుండాలు పథకం ప్రకారం దాడి చేశారు. చంపాలని పాశవికంగా దాడి చేశారు. ఇలాంటి పాశవిక దాడిని తెలంగాణ బుద్ది జీవులు సమాజం లోని అన్ని వర్గాలు ఖండించాలి. అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధాలతో దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా ..సీఎం రేవంత్ చెప్పాలి. చిలుక ప్రవీణ్ ,రంజిత్ ,ఆకుల ప్రవీణ్ అనే జర్నలిస్టుల మీద కూడా దాడులు వేధింపులు జరిగాయి. జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్త సాయిరాం రెడ్డి అని సీసీ టీవీ ఫుటేజీ లో స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిని సాయిరాం రెడ్డి కలిశాకే ఈ దాడి జరిగింది. సాయిరాం రెడ్డి హస్తిన పురం కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అనుచరుడు. కాంగ్రెస్ పాలన మూడు నెలలు కాకముందే అనేక ఆకృత్యాలు జరిగాయి. నిన్న మేడారం లో సీఎం రేవంత్ ముందే భక్తుల పై లాఠీ చార్జీ చేశారు. ఇప్పటి వరకు 2600 మంది బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు అయ్యాయి.ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా చేల రేగుతోంది. విసునూరు రామచంద్ర రెడ్డి, ఎర్ర పహాడ్ ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ ముఖ్ లలో దళిత బహుజనులు ఎలాంటి దాష్టీకాలు ఎదుర్కుంటున్నారో.. ఇపుడు నయా దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో అవే దౌర్జన్యాలు ఎదుర్కొంటున్నారు. నయా దేశ్ ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో దళిత బహుజన జర్నలిస్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తున్నారు. మా వాళ్ళు పిర్యాదు చేస్తే చెత్తబుట్టలో వేస్తున్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఇది పోలీసులు గుర్తు పెట్టుకోవాలి..మేము అన్ని గమనిస్తున్నాం.బీ ఆర్ఎస్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు బెదిరిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏ పోస్టులు పెట్టినా చెల్లుతుందా. రేవంత్ కు మీడియా పట్ల ఎలాంటి చులకన భావంతో ఉండే వారో ఆయన పాత వీడియో లను బట్టి అర్థం చేసుకోవచ్చన్నారు.
రేవంత్ పాలన ప్రజా పాలన కాదు.. తెలంగాణ మీద ప్రతీకార పాలన అని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. తెలంగాణ త్యాగాలతో వచ్చింది. ఆ త్యాగాలు రేవంత్ కు తెలియవు.తెలంగాణ కోసం పోరాడిన వారిపై రేవంత్ కక్ష కట్టారు. మా నియోజక వర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తల పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తూ ఉల్టా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎమర్జెన్సీ చీకటి రోజులను కాంగ్రెస్ పాలన తలపింపజేస్తోంది. జర్నలిస్టులు ప్రజా సమస్యల పైనే స్పందిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా. సిద్దిపేట జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్త చంపుతానని బెదిరిస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. మేధావులు ఈ అరాచక విధానాల పై స్పందించాలి. కేసీఆర్ హయం లో ఇలాంటివి జరగలేదు.
కాంగ్రెస్ పాలన అంటే బూతులు, దాడులుగా మారిందన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్. అభివృద్ధి పై ధ్యాస లేదు.కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఆర్ గా మారింది.కాంగ్రెస్ ఆర్ అంటే కాంగ్రెస్ రేవంత్ రౌడీలు. బీఆర్ఎస్ పై ఆరాచకాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: 13 ఏండ్ల బాలుడి డిమాండ్: పెళ్లి చేస్తేనే చదువుకుంటా
