రేవంత్ రెడ్డి ది స్కీం ల పాలన కాదు స్కాం ల పాలన అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఇవాళ(శనివారం)హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి 420 స్కీములు డిసెంబర్ 9 కే ఇస్తామని చెప్పి డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకో 25 పథకాలు ఇస్తామని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు మరిచిపోయేలా రేవంత్ చేష్టలు ఉన్నాయి. INC అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ. RR రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో 1450 కోట్ల వడ్ల కుంభకోణం జరిగింది. 35 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముకున్నారు. 2183 మద్దతు ధర ఉంటే 1900 కే అమ్మారు. Msp కంటే తక్కువ ధరకు అమ్మారు. ఈ గ్లోబల్ టెండర్లు ఆంధ్రవాళ్లకు వచ్చినయి. ఈ గ్లోబల్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ వడ్ల స్కామ్ మీద సీబీఐ, ఈడీ సుమోటోగా కేసు నమోదు చేసి ఎంక్వయిరీ వేయాలన్నారు జీవన్ రెడ్డి. దీని మీద మేం కూడా సీబీఐ ,ఈడీకి లెటర్ రాస్తామన్నారు. బీజీపీ కూడా దీని మీద నోరు మెదపడం లేదు బీజీపీ వాళ్ళ వాటా కూడా ఎంతో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డికి ధన సేకరణలో ఉన్న ధ్యాస ధాన్యం సేకరణలో లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లు కొన్నాం. రైతుల శ్రమ కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో ఉన్న బీజేపీకి ట్యాక్స్ వెళుతోంది. రేవంత్ రెడ్డి రౌడీ ఇజం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో,దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. హస్తం అంటే అవినీతి నేస్తం అని అన్నారు.
మహిళలకు తులం బంగారం అన్నావు ఇంకా ఇవ్వలేదు. రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు. గుడ్లు అమ్ముకునేటన్ని తెచ్చి ఎంపీ చేసినం మా పేరు చెప్పుకుని అవినీతి చేసిండు రంజిత్ రెడ్డి. ఎక్కడ తమ అవినీతి బయట పడుతుందోనని పార్టీ మారుతున్నారు. పార్టీ మారినోళ్ళను విడిచిపెట్టం వేటాడుతామన్నారు జీవన్ రెడ్డి.
ఇది కూడా చదవండి: కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి