రైతులను, ప్రజలను హోల్ సేల్ గా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు .. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అన్నారు. ఇవాళ( సోమవారం) హైదరాబాద్ లోని తెలంగాణభవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన…ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుబీమా. రైతులపై కేసీఆర్ నిబద్దతను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం హాస్యాస్పదం. రైతుల ఉసురు పోసుకుంటున్నది ఎవరు ? రైతులకు ఊపిరి పోసింది ఎవరో గ్రామాలకు వెళ్తే రైతులే చెప్తారు. కాంగ్రెస్ పాలనతో బీడువడ్డ తెలంగాణను పచ్చబడేలా చేసింది కేసీఆర్. రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల కష్టాలు పెరుగుతున్నాయి. రైతు ఆత్మహత్యలు బాగా పెరిగాయి. వ్యవసాయ పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పరిస్థితులు వచ్చాయి. అన్నదాతల ఆవేదన, ఆక్రందనలు భిన్నరూపాల్లో వ్యక్త పరుస్తున్నారు. రైతులు కంటతడి పెడుతున్నారు. అనవసరంగా కాంగ్రెస్ కు ఓటు వేశామని బాధ పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నాయకులు రైతులను పట్టించుకోకుండా ..ఇతర పార్టీల నాయకులకు కండువాలు కప్పే ఉన్న పనిలో ఉన్నారని విమర్శించారు నిరంజన్ రెడ్డి. ఎంత సేపు అధికారం, రాజకీయం తప్ప జనాన్ని, రైతులను పట్టించుకునే పని లేదు కాంగ్రెస్ నేతలకు అని అన్నారు.పాలన చేతనైతే రైతుల దగ్గరకు వెళ్లి దైర్యం చెప్పండి, నీళ్లివ్వండి అని అన్నారు. వచ్చే ప్రభుత్వం ఇంత హోల్ సేల్ గా మోసం చేస్తారు అని జనం అనుకోలేదని అన్నారు. మంత్రి తుమ్మల కూడా ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆయనంటే సోదరభావం ఉంది. కొంత గౌరవం ఉందన్నారు నిరంజన్ రెడ్డి. గతంలో మీరు మంత్రి గా ఉన్నప్పుడు వ్యవసాయ పరిస్థితులు ఏంటో తెలియదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ఆత్మవిశ్వాసం నింపాం. కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి రైతులు తల్లడిల్లుతున్నారు…200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పంటలకు మంట పెట్టుకున్న ఒక్క రైతునయినా ఎందుకు పరామర్శించడం లేదని అని అడిగారు. రైతాంగానికి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులు, ప్రజాప్రతినిధులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరంజన్ రెడ్డి. రైతులు నిలదీస్తారనే క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదన్నారు.
తుమ్మల పరిస్థితి చూస్తే జాలేస్తోందన్నారు నిరంజన్ రెడ్డి. గతానికి, ఇప్పటికి ఉన్న తేడా తెలియడం లేదా అని అన్నారు. కేసీఆర్ పాలనకు మించి మంచి చేస్తే హర్షిస్తామన్నారు. యాసంగి పంటలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇప్పించండన్నారు. గోదావరి బేసిన్ లో నీళ్లున్నా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రోజూ నాలుగు వేల క్యూసెక్కులు వృధాగా పోతున్నా నీటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం లేదన్నారు. ప్రాజెక్టుల మీద అవగాహన లేదు .. నీటిని మళ్లించుకునే ఆలోచన లేదని విమర్శించారు.అమావాస్య తర్వాత పౌర్ణమి ఉంటుందని విషయాన్ని కాంగ్రెస్ నేతలు, మంత్రులు గుర్తుంచుకోవాలన్నారు. గోదావరి నీళ్లను సహేతుకంగా వాడాలని సూచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రకృతి విపత్తును రాజకీయం చేస్తున్నారు అంటున్న మంత్రి తుమ్మల ప్రకృతి విపత్తుతోనే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు కుంగాయి అన్న విషయం తెలియదా ? కేసీఆర్ ను బద్నాం చేయాలనే గోదావరి నీళ్లను ఎత్తిపోయడం లేదన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే వరకు పోరాటం చేస్తాం. వ్యవసాయానికి, రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు నిరంజన్ రెడ్డి.
ఇది కూడా చదవండి: కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం… కేటీఆర్ ట్వీట్
The post రైతాంగానికి ధైర్యం ఇచ్చే సత్తాలేని పిరికివాళ్లు కాంగ్రెస్ మంత్రులు appeared first on tnewstelugu.com.