గ్రేటర్ వరంగల్ లో రూ.750 కోట్లతో స్మార్ట్ బస్ స్టేషన్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న బస్ స్టేషన్ ప్రాంతంలో కొత్త భవనాల నిర్మాణ ప్రక్రియను ఆర్టీసీ, కుడా సంయుక్తంగా చేపట్టనున్నాయి. రెండెకరాల స్థలంలో ఐదు అంతస్తుల్లో 32 బస్ స్టాప్లు ఉండేలా దీన్ని రూపొందించారు.
సువిశాలమైన ఈ కాంప్లెక్స్లో వాణిజ్య సముదాయం, షాపింగ్ మాల్స్, హోటళ్లు మరియు ఇతర సౌకర్యాలు ఉంటాయి. స్మార్ట్ బస్ స్టేషన్లతో అనుసంధానం చేసి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్, కొత్త నియో మెట్రో రైళ్లను నిర్మించనున్నారు.