శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష్మీ మహా యజ్ఞానికి భక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మహా కుంభ అభిషేకాన్ని వాయిదా వేసినట్లు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయంలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించిన అష్టవందల శ్రీచండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు.

హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి స్పందన లేకపోవడంతో మహా కుంభ అభిషేకాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రకటించింది. ఆలయంలో ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించిన అష్టవందల శ్రీచండీ రుద్ర రాజశ్యామ సుదర్శన సహిత లక్ష్మీ మహాయజ్ఞానికి భక్తుల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. దేవాదాయశాఖ ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన మహా కుంభాభిషేకాన్ని వేసవి కాలం కారణంగా కార్తీక మాసానికి వాయిదా వేసింది.
