
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టిక్కెట్లను జనవరి 9న విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజు ఉదయం 10 గంటలకు టిక్కెట్ల విక్రయం ఆన్లైన్లో ప్రారంభమవుతుంది. జనవరి 12 నుంచి 31వ తేదీ మధ్య ఫిబ్రవరి టికెట్ కోటా రూ.300 ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి టిక్కెట్లను జారీ చేయనున్న నేపథ్యంలో ఈ నెల 12 నుంచి 31 వరకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను 9వ తేదీన జారీ చేయనున్నట్లు తితిదే అధికారి వివరించారు.
