తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు సర్వభూపాల రథంపై కృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పూజించేందుకు భక్తులు అడుగడుగునా కర్పూరం సమర్పించారు.
అనంతరం ముఖ మండపంలో శ్రీకృష్ణ స్వామి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. పెద్ద జీయర్స్వామి, చిన జీయర్స్వామి, టీటీడీ బోర్డు సభ్యుడు శ్రీరాములు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఏఈవో ప్రభాకర్రెడ్డి, ఆలయ అర్చకులు వాహనసేవలో పాల్గొన్నారు.
855151