కేంద్ర ప్రభుత్వం ఇవాళ(శనివారం) జ్ఞానపీఠ్ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్, సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్య కు జ్ఞానపీఠ్ ప్రకటించింది.
హిందీ చిత్రసీమలో తన అనేక సూపర్ హిట్ గీతాలకు చక్కని సాహిత్యం అందించార గుల్జార్. గుల్జార్ అనేది కలం పేరు. ఆయన అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జాలువారాయి. ఆయన ఉర్దూ, పంజాబీ భాషల్లో పలు కథలు కూడా రాశారు. 2004లో ఆయనకు పద్మ విభూషణ్ ప్రదానం చేశారు.
జగద్గురు రామభద్రాచార్య 100కి పైగా పుస్తకాలు రచించారు. బాల్యంలోనే అంధత్వానికి గురైన రామభద్రాచార్య, దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో యూనివర్సిటీ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించిన తమిళనాడు ప్రభుత్వం..ఎందుకో తెలుసా..
