మోడల్ తాన్యా సింగ్ సూరత్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల తర్వాత ఈ కేసు ఆసక్తికర మలుపు తిరిగింది. ఊహించని రీతిలో ఈ కేసులో ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు అభిషేక్ శర్మ పేరు తెరపైకి వచ్చింది. మోడల్ తాన్యా సింగ్, క్రికెటర్ అభిషేక్ శర్మ మధ్య స్నేహం ఉందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు ఏసీపీ వీఆర్ మల్హోత్రా.
తాన్యా సింగ్ ఫోన్ నుంచి అభిషేక్ శర్మ ఫోన్ కు ఓ వాట్సాప్ మెసేజ్ వెళ్లినట్టు పోలీసులు గుర్తించారని, కానీ ఆ మెసేజ్ కు అభిషేక్ శర్మ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదని తెలిపారు. దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటికి వస్తాయన్నారు.ఈ కేసు విచారణలో భాగంగా అభిషేక్ శర్మను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అతడికి నోటీసులు పంపేందుకు చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో ని బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు
