ప్రజలు తమతో మోసగించబడాలనుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి గతం లో చెప్పారు హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రావణ్.రేవంత్ రెడ్డి తీరు ఇపుడు అలానే ఉంది. ఇవాళ(శనివారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. …27వ తేదీ నాడు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధి రెండు గ్యారంటీలు ప్రారంభిస్తారని చెబుతున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇచ్చింది..అందులో 13 హామీలున్నాయి. రూ 500 కు సిలిండర్ ,200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వారికి ఉచిత విద్యుత్ అన్నారు. రాష్ట్రం లో కోటి 24 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం 40 లక్షల మందికే ఉచిత 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటున్నారు. ప్రజా పాలన కింద ఎంత మంది 500 కే సిలిండర్ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.తెల్ల రేషన్ కార్డుల కోసం కొత్తగా ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం లేదు.90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటె 40 లక్షల మందికే ఈ పథకం వర్తిస్తుంది అంటున్నారు. అందరికీ ఇస్తామని ఇపుడే కొందరికే ఇస్తామంటున్నారు. ఏడాదికి 3నుంచి 5 సీలిండర్లు ఇస్తామంటున్నారు..ఇది దగా మోసం కాదా..మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు.ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు.
గ్యాస్ కనెక్షన్ లు ఉన్న వారందరికీ పథకం వర్తింపజేయాలన్నారు దాసోజు శ్రావణ్. ముందు డబ్బులు వినియోగ దారుడు కట్టాలి తర్వాత సబ్సిడీ ఇస్తామనేది సరి కాదు. రాష్ట్రంలో కోటి 34 లక్షల 48 వేల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.కోటి ఐదు లక్షల మంది 200 యూనిట్లలోపే విద్యుత్ వాడుతున్నారు. అందరికీ 200 యూనిట్ల లోపు వాడే విద్యుత్ ను ఉచితంగా ఇవ్వాలి. డొంక తిరుగుడు నిబంధనలు పెట్టడం సరికాదు. సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ అబద్ధమాడారు. 60 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ పచ్చి అబద్దం చెప్పారు. సమ్మక్క సారక్క సాక్షిగా సీఎం రేవంత్ నయవంచనకు పాల్పడ్డారు. అయిపోయిన పెళ్ళికి బాజా కొట్టినట్టు ఉంది సీఎం రేవంత్ తీరు. కేసీఆర్ హాయంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్ లు రేవంత్ తనవిగా ఎలా చెప్పుకుంటారన్నారు.2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ హయం లో ఇచ్చిన నోటిఫికేషన్లు కలిపితే ఎలా అని ప్రశ్నించారు. అమ్మ వారి సాక్షిగా అబద్దాలాడినందుకు సీఎం క్షమాపణ చెప్పాలన్నారు.
కరెంటు కోతలకు కొందరు అధికారులే కుట్ర పన్నారని సీఎం రేవంత్ అంటున్నారు.కరెంటు కట్ చేస్తే కొలువులు తీసేస్తా అని కూడా చెప్పారు.కేసీఆర్ హయం లో కను రెప్ప కొట్టుకునే సమయం కూడా కరెంటు పోలేదు.రేవంత్ రాగానే కరెంటు ఇబ్బందులు ఎందుకు మొదలయ్యాయి.రేవంత్ తన చేతకాని తనాన్ని అసమర్ధతను చిన్న ఉద్యోగుల పై ఫత్వాలు జారీ చేస్తున్నారు.రేవంత్ కు పాలన చేతకావడం లేదని ప్రజలు గ్రహించాలి. భట్టి సంబంధిత శాఖ మంత్రి ..కరెంటు పోయినందుకు ఆయన్ను కూడా రేవంత్ సస్పెండ్ చేస్తారా ? రైతు బంధు పై ఇప్పటి దాకా మీన మేషాలు లెక్కపెడుతున్నారు. ఆటోడ్రైవర్లు ఇప్పటిదాకా 30 మంది చనిపోయారు వారి సంక్షేమం కోసం మేనిఫెస్టో లో పెట్టిన అంశాన్ని ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రైతుల పండించిన పంటకు బోనస్ ఇస్తామన్నారు ..అది కూడా లేదు. హడావుడిగా హామీలు ఇచ్చినంత శ్రద్ద వాటి అమలు పై లేదు. మేము రేవంత్ ఇచ్చిన హామీల పైన నిలదీస్తూనే ఉంటామన్నారు దాసోజు శ్రావణ్.
ఇది కూడా చదవండి:రేవంత్ పాలన ప్రజా పాలన కాదు.. తెలంగాణ మీద ప్రతీకార పాలన
