హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లో అంతర్జాతీయ డ్రగ్స్ గుట్టు రట్టయింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విదేశాలకు మత్తు పదార్థాలను ఎగుమతి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఎనిమిది కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.9 కోట్లు ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు సరుకులు డెలివరీ చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.