నిబంధనల ప్రకారం ప్రమాణాలు పాటించని హైదరాబాద్ లోని పలు బ్లడ్ బ్యాంకులపై ఇవాళ(గురువారం) డ్రగ్ కంట్రోల్ అధికారులు నేడు దాడులు నిర్వహించారు. రక్తం సేకరించడం నుంచి పంపిణీ వరకు అనేక అవకతవకలు జరుగుతున్న విషయం గుర్తించారు. అంతేకాదు.. కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో ప్రమాణాలకు తిలోదకాలిచ్చి నాసిరకం వస్తువులు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. రక్తం సేకరించిన తర్వాత అందులోని ప్లేట్ లెట్లు, ప్లాస్మా నిల్వ చేసే సమయంలో లోపాలు ఉండడం వల్ల, ఆ రక్తం ఎక్కించిన రోగులకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో పలు బ్లడ్ బ్యాంకులకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇందులో..మల్కాజ్ గిరికి చెందిన శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్, ఉప్పల్ లోని.ఎంఎస్ఎన్ బ్లడ్ సెంటర్, చైతన్యపురికి చెందిన నవజీవన్ బ్లడ్ సెంటర్, బాలానగర్ చెందిన నంది బ్లడ్ సెంటర్, లక్డీకాపూల్ కు చెందిన ఏవీఎస్ బ్లడ్ సెంటర్, మోహిదీపట్నం కు చెందిన వివేకానంద బ్లడ్ సెంటర్, హిమాయత్ నగర్ చెందిన రుధిర వాలంటరీ బ్లడ్ సెంటర్, కోఠీలోని తలసేమియా రక్షిత బ్లడ్ సెంటర్, సికింద్రాబాద్ లోని ప్రతిమ సాయి బ్లడ్ సెంటర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగలేదు
