
హైదరాబాద్: హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొంపల్లి నుంచి మేడ్చల్ వెళ్తున్న కారు అతివేగంతో నిలిచిన లారీని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మరో ఘటనలో… దూలపల్లి నుంచి బహదూర్పల్లి వెళ్తున్న కారు సైకిల్ను ఢీకొట్టింది. దీంతో మోటార్సైకిల్పై ఉన్న యువకుడు మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని సుస్వంత్ నాయక్ (23 ఏళ్లు)గా గుర్తించారు. ఎంఆర్సిఇటి ఇంజినీరింగ్ కళాశాలలో సీనియర్ ఇయర్లో బిటెక్ చేస్తున్నట్టు తెలిపారు.
